తిరుమల: తిరుమల శ్రీవారిని భారతరత్న సచిన్ టెండూల్కర్ దంపతులు దర్శించుకున్నారు. సచిన్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగర్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ స్వామి వారి
తిరుమల: తిరుమల శ్రీవారిని భారతరత్న సచిన్ టెండూల్కర్ దంపతులు దర్శించుకున్నారు. సచిన్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగర్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం అర్చన సేవలో వీరందరు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించారు.
టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సచిన్, చిరంజీవి, నాగర్జున్ను చూడటానికి భక్తులు పోటీపడ్డారు. సచిన్ రావటంతో కేరింతలు కొట్టారు. భద్రతా సిబ్బంది సహాయంతో సురక్షితంగా కారు వద్దకు చేరుకుని సచిన్ దంపతులు అతిథి గృహానికి తిరిగి వెళ్ళారు.