Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో శబరి ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన పెను ప్రమాదం..

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (09:47 IST)
హైదరాబాద్ నుంచి తిరువనంతపురంకు వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరులో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై దుండగులు ఇనుప రాడ్డును ఉంచారు. నల్లపాడు - గుంటూరు సెక్షన్‌లో దండగులు ఈ పనికి పాల్పడ్డారు. అయితే, లోకో పైలట్ అప్రమత్తతో పెను ముప్పు తప్పింది. 
 
17230 అనే నంబరు కలిగిన రైలు హైదరాబాద్ - తిరువనంతపురం ప్రాంతాల మధ్య నడుస్తుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు గుంటూరు సెక్షన్‌లో పరుగులు తీస్కుంది. 
 
ఈ క్రమంలో రైలు పట్టాలపై దుండుగులు కట్టిన ఇనుప రాడ్‌ను లోకో పైలట్ గుర్తించి, వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేకులు వేశాడు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. ఈ అనుపరాడ్డును లోకో పైలెట్ గుర్తించకుంటే శబరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం జరిగివుండేది. రైలును ఆపిన తర్వాత రైల్వే సిబ్బంది ఇనుపరాడ్డును తొలగించిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. 
 
దుండగులు పొడవైన ఇను రాడ్డు పెట్టారు. రైలు వేగంగా ప్రయాణించే సమయంలో దాని అదురుకు ఆ ఇనుపరాడు కిందపడిపోకుండా ఉండేందుకు వీలుగా ఇనుపరాడ్డును గుడ్డతో కట్టారు. దుండగులు పథకం ప్రకారమే ఈ పని చేసివుంటారని రైల్వే సిబ్బంది అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై గస్తీ నిర్వహించే సిబ్బంది తనిఖీ చేసుకుంటూ వెళ్లిన తర్వాత దుండగులు ఈ పనికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments