Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీకర్ చాంబర్లో జరిగింది కేసీఆర్‌కు తెలియదు : ఎస్.జైపాల్ రెడ్డి

రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్ చాంబర్లో జరిగిన విషయాలు తనకేం తెలియవని కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. విభజన కథ మొత్తం జైపాల్ రెడ్డి నడిపించారనీ, లైవ్ టెలిక

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:36 IST)
రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్ చాంబర్లో జరిగిన విషయాలు తనకేం తెలియవని కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. విభజన కథ మొత్తం జైపాల్ రెడ్డి నడిపించారనీ, లైవ్ టెలికాస్ట్ ఆపేశారనీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఎస్.జైపాల్ రెడ్డి స్పందించారు. 'స్పీకర్‌ చాంబర్లో జరిగిన విషయాలు ఏవీ కేసీఆర్‌కు తెలియదు. ఉద్యమంలో ఆయన అద్వితీయ పాత్ర పోషించారు. కానీ, పార్లమెంటులో ఆయనకు పాత్ర లేదు. ఒక్కడే సభ్యుడు. ఏం జరుగుతుందో ఆయనకూ తెలియదు. లోక్‌సభకు అమాయకంగా 2 గంటలకు వచ్చి కూర్చున్నాడు. అంతే తప్ప చాంబర్లో ఏం జరిగిందో తెలియదు. మా మంత్రులకే తెలియదన్నారు. 
 
అయితే, స్పీకర్‌ చాంబర్లో మార్పులు చేయించింది మాత్రం తానేనని చెప్పారు. అలాగే, రాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడని నేను అనలేదు. అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే ప్రసక్తి ఉత్పన్నం కాలేదు. తెలంగాణ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యాం. తెలంగాణకు మా రుణం చెల్లించుకునే ప్రయత్నంలో భాగంగానే చేశాం. తప్ప, ఎవరు ముఖ్యమంత్రనే భావనతో చేయలేదు' అని జైపాల్‌రెడ్డి చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments