Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ స్మారక నాణెం చెలామణిలోకి వస్తుందా?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (10:55 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన స్మారకార్థం రూ.100 నాణెంను కేంద్రం విడుదల చేసింది. ఈ నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఈ నాణెం నుంచి రాష్ట్ర ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. 
 
రాష్ట్రపతి భవన్‍లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొనగా, వారి సమక్షంలో ఎన్టీఆర్ స్మారక నాణెంను విడుదల చేశారు. అయితే, ఈ నాణెం చెలామణిలోకి వస్తుందా రాదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ స్మారక నాణెం హైదరాబాద్‌లోని మింట్‌లో తయారైంది. దీనికి సంబంధించి మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మింట్లో తొలిసారి ఓ వ్యక్తి చిత్రంతో నాణేం ముద్రించినట్టు చెప్పారు. అయితే ఇది మార్కెట్లో చలామణి కోసం కాదని స్పష్టం చేశారు. 
 
తొలి విడతగా 12 వేల స్మారక నాణేలు ముద్రించామని, వీటి ధర రూ.3,500 నుండి రూ.4,850 వరకు ఉందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా, హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈ నాణేలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేస్తామన్నారు. ఇదిలావుంటే, ఈ కాయిన్‌ను మంగళవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments