Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ స్మారక నాణెం చెలామణిలోకి వస్తుందా?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (10:55 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన స్మారకార్థం రూ.100 నాణెంను కేంద్రం విడుదల చేసింది. ఈ నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఈ నాణెం నుంచి రాష్ట్ర ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. 
 
రాష్ట్రపతి భవన్‍లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొనగా, వారి సమక్షంలో ఎన్టీఆర్ స్మారక నాణెంను విడుదల చేశారు. అయితే, ఈ నాణెం చెలామణిలోకి వస్తుందా రాదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ స్మారక నాణెం హైదరాబాద్‌లోని మింట్‌లో తయారైంది. దీనికి సంబంధించి మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మింట్లో తొలిసారి ఓ వ్యక్తి చిత్రంతో నాణేం ముద్రించినట్టు చెప్పారు. అయితే ఇది మార్కెట్లో చలామణి కోసం కాదని స్పష్టం చేశారు. 
 
తొలి విడతగా 12 వేల స్మారక నాణేలు ముద్రించామని, వీటి ధర రూ.3,500 నుండి రూ.4,850 వరకు ఉందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా, హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈ నాణేలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేస్తామన్నారు. ఇదిలావుంటే, ఈ కాయిన్‌ను మంగళవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments