ఎన్టీఆర్ స్మారక నాణెం చెలామణిలోకి వస్తుందా?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (10:55 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన స్మారకార్థం రూ.100 నాణెంను కేంద్రం విడుదల చేసింది. ఈ నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఈ నాణెం నుంచి రాష్ట్ర ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. 
 
రాష్ట్రపతి భవన్‍లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొనగా, వారి సమక్షంలో ఎన్టీఆర్ స్మారక నాణెంను విడుదల చేశారు. అయితే, ఈ నాణెం చెలామణిలోకి వస్తుందా రాదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ స్మారక నాణెం హైదరాబాద్‌లోని మింట్‌లో తయారైంది. దీనికి సంబంధించి మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మింట్లో తొలిసారి ఓ వ్యక్తి చిత్రంతో నాణేం ముద్రించినట్టు చెప్పారు. అయితే ఇది మార్కెట్లో చలామణి కోసం కాదని స్పష్టం చేశారు. 
 
తొలి విడతగా 12 వేల స్మారక నాణేలు ముద్రించామని, వీటి ధర రూ.3,500 నుండి రూ.4,850 వరకు ఉందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా, హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈ నాణేలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేస్తామన్నారు. ఇదిలావుంటే, ఈ కాయిన్‌ను మంగళవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments