Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషికేశ్వరి సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్: ప్రిన్సిపల్ ప్రమేయం కూడా ఉందట!

Webdunia
సోమవారం, 27 జులై 2015 (12:31 IST)
ఆచార్య నాగార్జున వర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రిషికేశ్వరి ఆత్మహత్యలో వర్శిటీ ప్రిన్సిపల్ ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే తన సూసైడ్ నోట్‌లో రిషికేశ్వర్ అనీషా, సీనియర్ స్టూడెంట్స్ జయచంద్రన్ మరియు శ్రీనివాస్ అనేవారు తనను వేధించారని పేర్కొంది. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రిన్సిపల్ పేరు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అందరి నోళ్ళల్లో నానుతోంది. 
 
కాలేజీ క్యాంపస్‌లో ప్రిన్సిపల్ ర్యాంగింగ్‌ను ప్రోత్సహించే వారని రిషికేశ్వరి తండ్రి ఆరోపిస్తున్నారు. ఫ్రెషర్స్ డే రోజున ప్రిన్సిపల్ బాలీవుడ్ పాటలకు సీనియర్ స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారని తెలిసింది. అయితే ఈ అభియోగాలు రావడంతో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రిన్సిపల్ గుడవల్లి బాబు రావు వెంటనే ఆ పదవిని రాజీనామా చేశారు. 
 
ఈ నేపథ్యంలో తన కుమార్తె రిషికేశ్వరి గదిని మార్పు చేయాల్సిందిగా ఆయన్ని కోరితే అందుకు ఆయన అనుమతించలేదని ఆరోపిస్తున్నారు. ఇంకా రిషికేశ్వరి వేధింపులకు గురికావడంలో ప్రిన్సిపల్ పాత్ర కూడా ఉందన్నారు. కాలేజీలో యాంటీ-ర్యాంగింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఫ్రెషర్స్ డే రోజున ప్రిన్సిపల్ డ్యాన్స్ చేయడాన్ని.. ఆ కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు కళ్లారా చూశారని కూడా రిషికేశ్వరి తండ్రి చెప్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments