Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు: రోజా

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (10:58 IST)
ఓటుకు నోటు కేసుపై అసెంబ్లీలో వైకాపా తీర్మానం ఇస్తే టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఓటుకు నోటు కేసుపై అసెంబ్లీ తాము వాయిదా తీర్మానం ఇస్తే టీడీపీ ఉలిక్కిపడుతోందన్నారు. 
 
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ యత్నించిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు తెలంగాణకు చెందినదని అంటున్నారని... అలాంటప్పుడు కేసులో నిందితుడైన మత్తయ్యకు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆశ్రయం కల్పించిందని రోజా అడిగారు. 
 
ఓటుకు నోటు కేసు కోర్టులో ఉన్నందున దీనిపై చర్చకు అనుమతించనని స్పీకర్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. జగన్ కేసులపై టీడీపీ నేతలు రోజూ మాట్లాడుతున్నా స్పీకర్ మౌనంగా ఉండటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ఆడియోలో ఉన్న స్వరం చంద్రబాబుదా? కాదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments