Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా... ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (18:01 IST)
ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్న సామెత ఉంది. ఆ సామెతను తూచా తప్పకుండా పాటిస్తోంది ఎపిఐఐసి ఛైర్ పర్సన్, సినీనటి రోజా. తనకు శత్రవులుగా ఉన్న వారిని దగ్గరకు చేర్చుకుని మిత్రులుగా మార్చేసుకుంటుంది. పార్టీలో విభేదాలు ఉండడం.. అందులోను ఎమ్మెల్యేల మధ్య ఉండడం పెద్ద చర్చకే దారితీసింది.
 
తన సొంత నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఉండటం.. ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తుండటం.. తనకు తెలియకుండా పర్యటనలు చేయడం రోజాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలకు కారణమయ్యాయి. 
 
పార్టీలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. అయితే మహిళా దినోత్సవం రోజు రోజా పుత్తూరులోని నారాయణస్వామి ఇంటికి వెళ్ళారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని వెంటబెట్టుకుని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 
 
ఇద్దరు కలిసి ఒకే ప్రచార రథంపై ఎక్కి ప్రచారాన్ని నిర్వహించారు. ఇద్దరి ప్రచారం చూసిన పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. అభివృద్ధి, సంక్షేమం చూసి వైసిపికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి రోజా అంటూ డైలాగ్‌లు అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments