Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాను ఆహ్వానించి అడ్డుకుంటారా? పోరాడుతామన్న జగన్.. కంటతడి పెట్టిన రోజా

వైకాపా ఎమ్మెల్యే మీడియా ముందు కంటతడి పెట్టారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య రోజాను హైదరాబాద్‌కు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (15:22 IST)
వైకాపా ఎమ్మెల్యే మీడియా ముందు కంటతడి పెట్టారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య రోజాను హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
ప్రభుత్వం వల్ల తనకు ప్రాణహాణి ఉందని, తమ ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరు? అని ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు. గతంలో టీడీపీ కోసం ఏంతో కష్టపడితే ఇదా తనకిచ్చే బహుమతి అంటూ అడిగారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. ఉగ్రవాదినో, హంతకురాలినో అన్నట్లు పోలీసులు తనపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక శాసన సభ్యురాలికే రక్షణ లేకుండాపోయిందని అన్నారు. నారా బ్రాహ్మణి, వెంకయ్య నాయుడు కూతురు కోసమే జాతీయ మహిళా పార్లమెంట్ పెట్టారా..? అని రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
ఇదిలా ఉంటే.. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానించి అడ్డుకోవడంపై వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే.. ఇక సమాజంలోని సాధారణ మహిళలకు ఎలా రక్షణ లభిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ఆహ్వానం పంపికూడా అడ్డుకోవడమన్నది ఈ సదస్సును అపహాస్యం చేయడమేనని జగన్ వ్యాఖ్యానించారు. రోజాకు జరిగిన అన్యాయంపై పోరాడుతామని, అన్ని వేదికల్లోనూ ఈ ఘటనను లేవనెత్తుతామని జగన్ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments