Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే ఆ విలువ తెలియదు: రోజా

కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి చనిపోయి ఒకరోజు గడవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. ఏపీలో విద్యార్థులు పిట్టల్

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (15:35 IST)
కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి చనిపోయి ఒకరోజు గడవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. ఏపీలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ..  అఘాయిత్యాలు, అరచకాలు, ఆత్మహత్యలల్లో ఏపీ నెంబర్‌-1 అని అన్నారు.
 
మహిళల కన్నీటిలో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోతుందని అన్నారు. ఉషారాణి ఆత్మహత్యలపై స్పందించాల్సిన మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గంటాను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించాలని రోజా డిమాండ్‌ చేశారు. 
 
విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వేసిన కమిటీ ఏమైందని రోజా సూటిగా ప్రశ్నించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల ఆరాచకాలను ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే ఆ విలువ తెలియదని రోజా వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments