Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాజీ ఎక్స్ ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం... 25 తులాల బంగారు అపహరణ..!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (09:51 IST)
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో ప్రయాణించే రైళ్లలో భద్రత కరువైంది. పలు రైళ్లలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. తాజాగా తిరుపతి, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్న బాలాజీ ఎక్స్ ప్రెస్ రైల్లో ఆదివారం రాత్రి దోపిడీ దొంగలు పడ్డారు. 
 
కడప జిల్లా రాజంపేట మండలం హస్తవరం సమీపంలో రైలు వెళుతుండగా రైల్లోకి చొరబడిన దోపిడీ దొంగలు కత్తులతో ప్రయాణికులను బెదిరించారు. ఈ రైల్లో ఉన్న 7, 8, 9 బోగీల్లోని ప్రయాణికులపై దాడికి దిగిన దొంగలు మహిళల మెడల్లోని 25 తులాల బంగారాన్ని దోచుకున్నారు. 
 
దోపిడీ దొంగల బీభత్సంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు రైలు గుత్తిలో ఆగగానే అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments