Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదం కాదు... వెంటాడి చంపారు... 'పశ్చిమ కారు' ప్రమాదంలో కొత్త కోణం

ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో అక్క చనిపోగా, చెల్లి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరింది. ఇపుడు ఈమె కోలుకోవడంతో ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (07:55 IST)
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో అక్క చనిపోగా, చెల్లి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరింది. ఇపుడు ఈమె కోలుకోవడంతో ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత చెల్లెలు పావని గొంతు విప్పింది. రోడ్డు ప్రమాదం ముసుగులో కోరలు చాపిన మృగాళ్ల వికృతత్వాన్ని వెలుగులోకి తెచ్చింది. బాధితురులాలు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
నరసాపురానికి చెందిన పావని అక్క గౌతమి గ్రూప్‌-1కి సిద్ధమవుతోంది. మూడు నెలలుగా విశాఖలో కోచింగ్‌ తీసుకుంటుంది. చెల్లెలిని ఎక్కించుకొని గౌతమి స్కూటీపై బయలుదేరింది. సరిగ్గా అదే మార్గంలో వచ్చిన విశాఖకు చెందిన వాహనం దూసుకొచ్చింది. ఇది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం- పాలకొల్లు మధ్య జాతీయ రహదారిపై జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందనేది పావని కళ్లకు కట్టినట్టు వివరించింది.
 
'పాలకొల్లు నుంచి మా స్కూటీని వెంబడించారు. మేం వేగం పెంచితే, మరింత దూకుడుగా దూసుకొచ్చారు. మేం తగ్గితే.. వారూ స్లో అయ్యేవారు. చాలాదూరం ఇలాగే అమానుషంగా వెంటాడారు. మమ్మల్ని తరుముకొస్తుంది పోకిరీలని మాకు అర్థం అయింది. వారికి దారి ఇద్దామని రోడ్డు దిగి.. చిన్నగా వెళుతున్నాం. ఒకటి, రెండుసార్లు గుద్దడానికి ప్రయత్నించగా, తప్పించుకొన్నాం. అయినా, వదలలేదు. వేగంగా వచ్చి ఢీకొట్టేశారు. అక్క ఎటో పడిపోయింది. నేను కారు బానేట్‌పై పడిపోయాను. రక్షించాలని కేకలు వేశాను. అయినా, వదల్లేదు. ఆడపిల్లలని జాలీ చూపలేదు. అంతంతకు వేగం పెంచేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి నేను ఆస్పత్రిలో పడి ఉన్నాను' అని పావని వివరించింది. 
 
ఈ ప్రమాదంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించింది. కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ శిరినినీడి రాజ్యలక్ష్మి.. నరసాపురం ఆస్పత్రిలో పావనిని పరామర్శించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, దోషులు ఎంతటివారైనా శిక్ష పడేలా చర్యలు తీసుకొంటామని భరోసా ఇచ్చారు. డీఎస్పీని కలిసి కేసును దర్యాప్తుపై ఆరా తీశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments