Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి... ఒకరికి తీవ్ర గాయాలు

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
 
హైదరాబాద్‌ నుంచి కర్నూలు జిల్లా ఆళగడ్డకు వెళ్తున్న డీసీఎం వ్యాను పాలెం వద్ద రోడ్డు దాటుతున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యానులో ప్రయాణిస్తున్న దస్తగిరి(30), మహబూబ్‌పాషా(28) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
తీవ్రంగా గాయపడ్డ మహబూబ్‌పాషా(30)ను వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీలో ఉన్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments