Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి మృతి

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (10:51 IST)
తూర్పుగోదావరి జిల్లా గుండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగంది. 13 మందితో వెళుతున్న వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఏలూరు జిల్లాలోని వివధ గ్రామాలు, మండలలాకు చెందిన 13 మంది టాటా మ్యాజిక్ వాహనంలో అనకాపల్లి జిల్లా కశింకోటలోని పరమటమ్మ తల్లి ఆలయానికి వెళుతున్నారు.

ఈ క్రమంలో గుండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల్లజర్లకు చెందిన డ్రైవర్ కొండా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రసాద్ (48), మహేశ్ (28), మంగ (36), మణికంఠ (25) అనేవారు చనిపోయారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments