Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా మళ్లీ మొదలుపెట్టారు... తెలుగు దొంగల పార్టీ... మంత్రులు గంగిరెద్దులు, దద్దమ్మలు...

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పెదబాబు-చినబాబు బినామీ పేర్లతో అమరావతి రాజధాని భూములను స్వాహా చేస్తున్నార

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (17:55 IST)
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పెదబాబు-చినబాబు బినామీ పేర్లతో అమరావతి రాజధాని భూములను స్వాహా చేస్తున్నారని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడుగారు నడుపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాదనీ, తెలుగు దొంగల పార్టీ అని అన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని సింగపూర్ దేశంలో తాకట్టు పెట్టేశారని ఆమె ఎద్దేవా చేశారు.
 
సింగపూర్ దేశానికి ఏపీ భూములను అప్పగించేందుకు స్కెచ్ వేశారనీ, అందుకు ఆయన అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించిన సంగతి గుర్తుచేశారు. ఇంత దోపిడీ జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారనీ, బాబు చెప్పినదానికల్లా గంగిరెద్దుల్లా తలలు ఆడిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సింగపూర్ కు భూములు కట్టబెట్టకుండా అడ్డుకునేందుకు అవసరమైతే తాము నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తామని ఆమె చెప్పారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments