Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
గురువారం, 29 జులై 2021 (11:22 IST)
తిరుపతి నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తి నివారణకు సహకరించాలంటూ కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీష కోరారు. వారం ముందువరకు 2.5శాతం పాజిటివిటీ రేటు ఉండగా ఇప్పుడు 3.5గా నమోదు కావడం ఆందోళన కల్గిస్తోందన్నారు.

ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడమే కేసుల  పెరుగుదలకు కారణంగా కనిపిస్తోందన్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేసుకోవాలని, ఒకవేళ పాజిటివ్‌ వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా విష్ణునివాసంలోని కొవిడ్‌ సెంటర్‌కు వెళ్లాలని కోరారు. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

వ్యాక్సిన్లు వేసుకున్నాం కదా... ఏమీకాదని నిర్లక్ష్యంగా తిరగవద్దన్నారు.అర్హులైన వారందరూ వ్యాక్సిను వేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 2,08,764 మందికి వ్యాక్సిన్‌ వేయడం జరిగిందన్నారు. షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్లు, దుకాణాల్లో అప్రమత్తం చేయడం జరిగిందని, మాస్కులేని వారికి జరిమానా విధిస్తున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments