Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
గురువారం, 29 జులై 2021 (11:22 IST)
తిరుపతి నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తి నివారణకు సహకరించాలంటూ కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీష కోరారు. వారం ముందువరకు 2.5శాతం పాజిటివిటీ రేటు ఉండగా ఇప్పుడు 3.5గా నమోదు కావడం ఆందోళన కల్గిస్తోందన్నారు.

ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడమే కేసుల  పెరుగుదలకు కారణంగా కనిపిస్తోందన్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేసుకోవాలని, ఒకవేళ పాజిటివ్‌ వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా విష్ణునివాసంలోని కొవిడ్‌ సెంటర్‌కు వెళ్లాలని కోరారు. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

వ్యాక్సిన్లు వేసుకున్నాం కదా... ఏమీకాదని నిర్లక్ష్యంగా తిరగవద్దన్నారు.అర్హులైన వారందరూ వ్యాక్సిను వేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 2,08,764 మందికి వ్యాక్సిన్‌ వేయడం జరిగిందన్నారు. షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్లు, దుకాణాల్లో అప్రమత్తం చేయడం జరిగిందని, మాస్కులేని వారికి జరిమానా విధిస్తున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments