Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ‌లో తెరాస వంద సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం: రేవంత్‌ రెడ్డి సవాల్

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (06:43 IST)
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస 100 సీట్లు గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని తెదేపా తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎన్నికల శంఖారావంలో ఆయన ప్రసంగించారు. 
 
తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ హయాంలో పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దుచేయడంతోనే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. తెలంగాణ యువకులంతా మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆటవిక పాలన సాగుతోందని, హైదరాబాద్‌లోనూ బీసీలు, ఎస్సీలు తెరాస అక్రమాలను అడ్డుకొనేందుకు ధైర్యంగా ముందుకురావాలని విజ్ఞప్తిచేశారు. 
 
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, తెరాస బెదిరింపులకు భయపడేదిలేదని టీడీపీ ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య అన్నారు. జీహెచ్‌ఎంసీలో కావాల్సినన్ని నిధులున్నాయని, వాటిని కాజేయాలని కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఈ సందర్భంగా కృష్ణయ్య ఆరోపించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments