పిటీషనర్ల సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించండి: అనంతపురం జిల్లా ఎస్పీ

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (07:15 IST)
అనంతపురం జిల్లాలో స్పందనకు వచ్చే పిటీషనర్ల సమస్యలకు సత్వరమే స్పందించి సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 140 పిటీషన్లు స్వీకరించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో స్పందన నిర్వహించారు. పిటీషనర్లకు సౌకర్యవంతంగా ఉండేలా సీటింగ్ , తదితర ఏర్పాట్లు చేశారు.  పిటీషనర్ల బాధలు, సమస్యలను జిల్లా ఎస్పీ సమగ్రంగా విన్నారు.

పిటీషనర్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలా...  జిల్లా నలమూలల నుండీ విచ్చేశారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, రస్తా వివాదాలు, ఉద్యోగ మోసాలు, సైబర్ మోసాలు, భూవివాదాలు... ఇలా తమకున్న సమస్యలను ఎస్పీ ముందు స్వేచ్ఛగా విన్నవించారు.

పోలీసు పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కరోనా వేళ.... మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ... శ్యానిటైజర్ అందుబాటులో ఉంచారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ నాగేంద్రుడు, ఎస్బీ డి ఎస్ సి ఉమా మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments