Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ కథా రచయిత కారా కన్నుమూత.. నిరాడంబరమైన జీవితం.. కథానిలయానికే అంకితం

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (14:03 IST)
Kalipatnam Rama Rao
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు తుదిశ్వాస విడిచారు. జిల్లాలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్‌ను కారా మాష్టారు అందుకున్నారు.
 
 సరళమైన రచనా శైలితో సామాన్య పాఠకుల గుండెలకు సైతం హత్తుకునేలా సాగిన కారా మాస్టారు రచనా పరంపర, భావ ప్రాధాన్యతతో ముందుకు సాగింది. వారి కథలు తెలుగు సాహిత్యానికి వన్నెలు అద్ది జాతీయ స్థాయి గౌరవాన్ని అందించాయి.
 
1996లో కారా మాస్టారు సాహిత్య అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాష్టారు ఈరోజు కన్నుమూశారు. రామారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక రామారావు (కారా) మృతిపట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ' కారా ' చిరస్మరణీయులన్నారు. 
 
కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాష్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని కృష్ణదాస్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments