Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి ఆంధ్రా ఆస్తులు : రేణిగుంట ఎయిర్‌పోర్టు కూడా ప్రైవేటీకరణ

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే దేశంలోని అతిపురాతన రైల్వేస్టేషన్‌లలో ఒకటిగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటీకరించనున్నట్టు ప్రకటించింది. ఇపుడు రేణిగుంట విమానాశ్రయాన్ని అమ్మకానికి పెట్టింది. 
 
విమానాల స‌ర్వీసుల సంఖ్య త‌గ్గిపోవ‌డంతో ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యం కేంద్రం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం త‌ర్వాే ఎక్కువ మంది ప్ర‌యాణీకులు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండే ప్ర‌యాణాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
కేంద్రం మొత్తం దేశ వ్యాప్తంగా 13 విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటిక‌రిస్తుండ‌గా వాటిలో తిరుప‌తి విమానాశ్ర‌యం కూడా ఉంద‌ని కేంద్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే కేంద్రం స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటు అప్ప‌గిస్తామని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో కేంద్రానికి వ్య‌తిరేకంగా ఏపీలో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు రేణిగుంట విమానాశ్ర‌యం కూడా ప్ర‌వేటీక‌ర‌ణ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో నిర‌స‌న‌లు మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments