Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయపాటి వర్సెస్ జేడీశీలం: ఏపీ క్యాపిటల్‌పై రచ్చ

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:04 IST)
ఏపీ క్యాపిటల్‌పై రాయపాటి, జేడీశీలంల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ వేశారు. 
 
వినుకొండ, గుంటూరు ప్రాంతాల్లో భూములు ఉన్న వారు కొందరు శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేశారని రాయపాటి ఆరోపించారు. కొందరి సూచన మేరకే వినుకొండను రాజధాని అన్నారని ఆరోపించారు. దొనకొండలో కమిటీ సభ్యులు భూములు కొన్నారని ఆరోపించారు. 
 
రాయపాటి వ్యాఖ్యల పైన జేడీ శీలం స్పందించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే రాయపాటి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరిలో రాజధాని ఏర్పాటు కావాలని టీడీపీ నేతలు కోరుతున్నారన్నారు. కమిటీ నివేదికతో టీడీపీ నేతలు కంగుతిన్నారన్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments