Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రాకముందు తలసాని విలువెంత?: రావెల ఫైర్

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (13:17 IST)
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. రాజకీయాల్లోకి రాకముందు తలసాని విలువెంత? సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం ఎంత? అని రావెల పైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటూ తలసాని చేసిన వ్యాఖ్యలపై రావెల మండిపడ్డారు. 
 
తలసానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనేనని, చంద్రబాబు హయాంలో పదవులను అనుభవించి, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తలసాని చంద్రబాబుపై విమర్శలు చేస్తారా? ఏంటిది? అంటూ ఎద్దేవా చేశారు. తలసానికి చట్టంపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని అందుకే టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే... టీఆర్ఎస్ మంత్రిగా పదవిని అనుభవిస్తున్నారని చెప్పారు. 
 
అలాగే పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్‌లపై రావెల కిషోర్ బాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్, జగన్‌లు కుమ్మక్కై చంద్రబాబును దెబ్బతీయాలనుకున్నారని... చివరకు వారు తీసుకున్న గోతిలో వారే పడే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, వైకాపాల కుట్రలు ఇకపై కొనసాగబోవని చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments