Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్‌ట్రాల్ అనే మాట వాడలేదు.. పవనే వక్రీకరించారు : రావెల కిషోర్ బాబు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (16:42 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి రావెల కిషోర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాను రైతులను ఉద్దేశించి ఆఫ్‌ట్రాల్ అనే పదాన్ని ఎక్కడా కూడా వినియోగించలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో పవన్ కళ్యాణే తన మాటలను వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
మంత్రి రావెల శుక్రవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని భూసేకరణ విషయంలో తానేమీ అనుచితంగా మాట్లాడలేదని, వ్యవహరించలేదన్నారు. భూములు ఇవ్వని రైతులను ఉద్దేశించి తాను "ఆఫ్‌ట్రాల్" అనే పదం ఎక్కడా వాడలేదని వివరణ ఇచ్చారు. 
 
తన వ్యాఖ్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వక్రీకరించారని ఆరోపించారు. తాను మాట్లాడిన విషయాలను ఆయన సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు గౌరవమని, టీడీపీకి జనసేన పార్టీతో విభేదాలు లేవని, తమ రెండు పార్టీలు మిత్రపక్షాలని ఆయన గుర్తు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments