Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథసప్తమి రోజున శ్వేతనాగు సూర్య నమస్కారం... ఫోటో

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించారు. సూర్యుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తరించారు. అరసవల్లి, తిర

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (12:15 IST)
రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించారు. సూర్యుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తరించారు. అరసవల్లి, తిరుమలలో జరిగిన రథసప్తమి ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో భద్రాచలం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రథసప్తమి రోజున శ్వేతనాగు, సూర్య నమస్కారం చేస్తూ కనిపించిందని అటవీ శాఖాధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏమిటంటే.. భద్రాద్రి సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో పులులను లెక్కించేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. సూర్యోదయం సమయంలో అరుదుగా కనిపించే శ్వేతనాగం.. పడగవిప్పి.. రెండు అడుగుల మేర పైకి లేచి.. సూర్యుని వైపు నిలబడి కనిపించింది.
 
అధికారుల అలికిడి విన్నప్పటికీ, కదలకుండా అలాగే నిలబడింది. ఈ దృశ్యాన్ని అధికారులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. సూర్యునిని అలా చూశాక శ్వేతనాగు పక్కనే వున్న పొదల్లోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments