Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:23 IST)
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి దక్కిన పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది.

ఆత్రేయపురం ప్రధాన తపాలా కార్యాలయంలో విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు ప్రత్యేక తపాలా కవరును విడుదల చేశారు. ఈ కవర్‌ను రూ.20లకు పొందవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండనున్నాయి.
 
సుమారు 300ఏళ్ల క్రితం ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కుటీర పరిశ్రమగా ఏర్పడింది. కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాధిస్తూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తపాలాశాఖ కవర్ విడుదల చేసి మరోసారి గుర్తింపు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments