Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి : రాపోలు

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (15:09 IST)
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజాలు బహిర్గతమవుతాయని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అభిప్రాయపడ్డారు.
 
ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఆదివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. సీనియర్ల ర్యాగింగ్ వల్లే రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడిందన్నారు. అందువల్ల ఈ కేసును సీబీఐతో విచారణ జరిపిస్తేనే, అసలు నిందితులు వెలుగులోకి వస్తారని స్పష్టంచేశారు. 
 
ఆమె మరణం వెనుక పరోక్షంగానైనా వర్శిటీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని రాపోలు వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న విచారణలతో న్యాయం జరగదని, తక్షణం కేసును సీబీఐకి అప్పగించాలని ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments