Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీ అంతిమ విశ్రాంతి స్థలం.. నా జీవితంలో మరిచిపోలేను..

సెల్వి
శనివారం, 8 జూన్ 2024 (15:49 IST)
హైదరాబాద్‌లోని నానక్ రామ్‌గూడలోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించి, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
 రామోజీరావు మృతి పట్ల టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సంతాపం తెలిపారు. రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికపై ఓ వీడియోను విడుదల చేశాడు. 
 
తన అంతిమ విశ్రాంతి స్థలం ఎక్కడ ఉండాలనేది కొన్నాళ్ల క్రితమే రామోజీ నిర్ణయించుకున్నారని వీడియోలో రాజు పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
 
ఉదయం నిద్ర లేవగానే రామోజీరావు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, కొన్ని నెలల క్రితం ఆయనతో రెండు గంటలపాటు మాట్లాడడం నా జీవితంలో మరిచిపోలేనిదని రాజు వీడియోలో పేర్కొన్నారు. 
 
తన అంతిమ విశ్రాంతి స్థలం ఎక్కడ ఉండాలనేది చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నారు. అది రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఉద్యానవనంగా అభివృద్ధి చేయబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

రష్మిక మందన్న బాటలో శ్రీలీల.. ఏం చేయబోతోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?

తర్వాతి కథనం
Show comments