Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ పవన్.. వెన్నుపోటు ఖాయం.. బీ కేర్‌ఫుల్ విత్ నాదెండ్ల మనోహర్ : ఆర్జీవీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:43 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి, పవన్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఈయన్ను ఉద్దేశించి ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో వర్మ మరోమారు హాట్‌టాపిక్ అయ్యారు. 
 
తనకున్న అంతర్గత సమాచారం మేరకు ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌.. పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో మనోహర్ తండ్రిగారైన నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. అలాగే, నాదెండ్ల మనోహర్ కూడా అలా చేస్తారేమోనని తనకు ఆందోళనగా ఉందని ఆయన చెప్పారు. 
 
ఈ విషయాన్ని పవన్‌కు ఒక అభిమానిగా చెబుతున్నానని.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా అధినేతకు జాగ్రత్తలు సూచించాలని కోరారు. అయితే, వర్మ చేసిన ఈ కామెంట్స్‌ను పవన్ తేలిగ్గా తీసుకుంటున్నారు. తన దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాలోని 'వెన్నుపోటు' పాటను శుక్రవారం వర్మ విడుదల చేస్తున్నారు. ఆ పాటకు, సినిమాకు పబ్లిసిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా… ప్రజల్లో పేరున్న నాయకుడికి వెన్నుపోటు ప్రమాదం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments