Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రకు అమరాతి ఒక్కటే రాజధాని : రాహుల్ గాంధీ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:08 IST)
నవ్యాంధ్రకు రాజధాని అమరావతి ఒక్కటేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి ఆయన ఆలూరు సరిహద్దుకు చేరుకున్నారు. మధ్యాహ్నం యాత్ర తిరిగి ప్రారంభమై ఆలూరు హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని మండలం శాగి గ్రామం వరకు కొనసాగనుంది. 
 
రాత్రి రాహుల్ అక్కడే బస చేస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఉదయం నుంచి జరుగుతున్న యాత్రలో ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీ జేడీ శీలం, పార్టీ సీనియర్‌ నేత కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ యాత్ర జయప్రదం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు జన సమీకరణ చేపట్టారు.
 
ఈ సందర్భంగా అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలిశారు. వీరిలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, పోలవరం నిర్వాసిత రైతులు ఉన్నారు. స్థానిక రైతులతో కలిసి నినాదాలు చేస్తూ రాహుల్‌ బస చేసిన శిబిరానికి చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్‌కు వినతిపత్రం సమర్పించారు. 
 
అమరావతి రైతుల వినతిపై రాహుల్ స్పందిస్తూ, 'ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే ఏకైక రాజధాని కావాలి. అమరావతి రైతుల పోరాటానికి నేను సంఘీభావం తెలుపుతున్నా. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తాం' అని రాహుల్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments