అమరావతిని తరలించడం సాధ్యంకాదని అర్థమైంది.. అందుకే ప్రైవేటు బిల్లు : ఆర్ఆర్ఆర్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:10 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించడం సాధ్యంకాదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అర్థమైందని అందుకే రాజ్యసభలో మూడు రాజధానుల అంశంపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారని వైకాపా రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు అన్నారు. 
 
రాజ్యసభలో విజయసాయి రెడ్డి మూడు రాజధానుల అంశంపై ఓ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై "ఆర్ఆర్ఆర్" స్పందించారు. అమరావతిని అక్కడ నుంచి తరలించడం అసాధ్యమని తేలిపోయిందన్నారు. అందుకే మూడు రాజధానుల కోసం ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే, అమరావతిని ఒక్క అంగుళం కూడా అక్కడ నుంచి తరలించలేరన్నారు. 
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాల సమస్యలు ఏకరవు పెట్టారని, కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఆ ఊసే ఎత్తలేకపోయారన్నారు. దీనికి కారణం కేసుల భయమన్నారు.
 
అలాగే, ప్రధాని మోడీ సైతం మాతృభాషలో విద్యా బోధన సాగాలని సూచన చేస్తున్నారని చెప్పారు. కానీ, సీఎం జగన్ మాత్రం ఉన్న పాఠశాలలు మూసివేస్తూ, ఆంగ్ల బోధనకు జై కొడుతున్నారన్నారు. ఆంధ్రరాష్ట్రంలో తెలుగు అనేది లేకుండా చేయాలన్నది జగన్ అండ్ కో కుట్రలా ఉందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments