Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ పదవి కోసం పయ్యావుల.. గాలి పోటాపోటీ!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (11:42 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడులది విచిత్రమై పరిస్థితి. వీరిద్దరూ అసెంబ్లీలో ఉంటే టీడీపీ అధికారంలో ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. వీరిద్దరు అసెంబ్లీలో ఉండరు. ఇది అనుభవపూర్వకంగా నిరూపితమైంది. అయితే, ఈ ఇద్దరు నేతలు కూడా మంచి వాక్చాతుర్యం కలిగిన నేతలు. గత ప్రభుత్వాల పనితీరును అసెంబ్లీలో ఎండగట్టడంలో కీలక పాత్ర వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే వీరిద్దరూ మంత్రులవుతారని అందరూ భావించారు. 
 
అయితే, కథ అడ్డం తిరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ.. వీరిద్దరు మాత్రం ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టలేక పోయారు. ఈ ఇద్దరు నేతలూ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముద్దుకృష్ణమ నాయుడు మాట ఎలా ఉన్నా కేశవ్‌ను ఎమ్మెల్సీగా చేసి చంద్రబాబు మంత్రిని చేస్తారని తెలుగుదేశం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో చూడాల్సివుంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments