మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కొండచిలువ నాట్యం చేస్తోంది. నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్పై కొండచిలువ ఎక్కి దిగింది.
పక్కనే పొదల్లో నుంచి వచ్చిన ఆ కొండచిలువ డ్రైవర్ పైకి ఎక్కి నాట్యం చేసింది. ఇంత జరిగినా ఏం జరగనట్లు మద్యం మత్తులో వున్న వ్యక్తి వుండిపోయాడు.
అయితే దీన్ని గమనించిన గ్రామస్తులు షాక్ అయ్యారు. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేశారు గ్రామస్తులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.