Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు నేనూ అన్ని మూసుకొని వారి మాట విందాం బ్రదరూ...

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:21 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఇదే స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయి ప్రముఖ సినీ నిర్మాత, బడా పారిశ్రామికవేత్త పీవీపీ వరప్రసాద్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మరింత ముదిరిపాకానపడింది. దీంతో వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. 
 
ఈనేపథ్యంలో తాజాగా ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ మరోమారు కేశినేని నాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాజాగా ఎంపీ కేశినేని నాని టార్గెట్‌ చేస్తూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన పీవీపీ, 'రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బ్రదరూ... ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తింస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం కేశినేని నాని' అని అన్నారు. ఈ ట్వీట్‌పై కేశినేని స్పందించాల్సివుంటగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments