Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు రేషన్ బియ్యం స్వాధీనం.. స్టెల్లాలో అధికారుల తనిఖీలు

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (14:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని భారీ మొత్తంలో ఆఫ్రికా దేశాలకు ఈ బియ్యాన్ని తరలిస్తున్న విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెలుగులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే నౌకను పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నౌకలో అనేక శాఖల ఉన్నతాధికారులతో కూడిన బృందం తనిఖీలు చేస్తుంది. 
 
ఈ బృందంలో ఏపీ రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పోర్టు, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఈ మల్లీ డిసిప్లినరీ కమిటీని వేసిన విషయం తెల్సిదే. ఈ నౌకలో నిల్వవుంచి బియ్యం నమూనాలన సేకరించి నిజానిజాలను నిగ్గు తేల్చనున్నారు. 
 
ఈ షిప్‌లో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27వ తేదీన ప్రకటించగా, 29వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి, బియ్యం స్మగ్లింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే బుధవారం అధికారుల బృందం మరోమారు తనిఖీలను చేపట్టింది. 
 
ఇదిలావుంటే, జిల్లా కేంద్రమైన నెల్లూరులో అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదికారులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న లారీని బద్వేల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న రూ.15 లక్షల విలువైన 600 బస్తాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. లారీతో పాటు డ్రైవర్ ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం