Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో సినిమా వారికి నిరసన

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (22:25 IST)
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి వచ్చిన సినీ ప్రముఖులకు రాజధాని రైతుల సెగ తగిలింది. మంగళవారం హైదరాబాద్‌ నుండి సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.సురేష్‌బాబు తదితరులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడి నుండి ఉండవల్లిలోని మాజీ ఎంపి గోకరాజు గంగరాజు గెస్ట్‌ హౌస్‌కు వచ్చారు. ఇది తెలుసుకున్న రాజధాని రైతులు వారు బస చేసిన గెస్ట్‌ హౌస్‌ దగ్గరకు చేరుకున్నారు. రైతుల పోరాటానికి సంఘీభావం తెలపాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను పంపించి వేశారు. అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలు మంగళవారానికి 175వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారి పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో పొలిటికల్‌, నాన్‌ పొలిటికల్‌ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతుల న్యాయమైన పోరాటానికి జెఎసి అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments