Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు కోసం 27న మహాగర్జన - విశాఖ ఉక్కు పోరాట కమిటీ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (08:13 IST)
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుగా పేర్కొనే విశాఖపట్టణం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా పోరాటం ఉధృతం చేయాలని  విశాఖ ఉక్కు పోరాట కమిటీ నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఈ నెల 27వ తేదీన లక్ష మందితో ప్రజా గర్జన నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తమిళనాడులో జల్లికట్టు క్రీడ కోసం సాగిన ఉద్యమాల తరహాలో ఈ పోరాటం సాగించాలన్న నిర్ణయానికి వచ్చారు.
 
ఇదే అంశంపై ఏఐటీయూసీ కార్యాలయంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. 32 మంది అమరుల ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దక్కించుకున్నామని, ఇపుడు దాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం పావులు కదపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
కరోనా సమయంలో కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, సొంత మైన్స్ లేకపోయినా ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించామని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ఒక ఆర్థిక వనరు అని, దేశానికే తలమానికం అని అన్నారు. అందువల్ల ఈ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు తమిళనాడులో జల్లికట్టు, తెలంగాణా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పోరాటం చేస్తామని వారు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments