Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిపిలు ఆదర్శం కావాలి: మంత్రి పేర్ని నాని

Webdunia
శనివారం, 9 మే 2020 (21:33 IST)
న్యాయ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పిపి) అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లకు  వివిధ కేసుల విచారణలో సమర్ధత, కష్టించి పనిచేసే తత్వం నిజాయితీ ఎంతో అవసరమని అటువంటి వారినే ప్రభుత్వం ఎంపిక చేసిందని  రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని )  పేర్కొన్నారు.

శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఇటీవల జిల్లా కోర్టు పరిధిలోని వివిధ కోర్టులలో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు గా నియమించబడిన పలువురు మంత్రి పేర్ని నాని ని మర్యాద పూర్వకంగా కలిశారు.

వీరిలో జిల్లా కోర్టులోని 9 వ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ గా  భోగిరెడ్డి వెంకన్నబాబు, మొదటి అదనపు జిల్లా కోర్టు కు ఏ పి పి గా మట్టా రామదాసు, 9 వ అదనపు జిల్లా కోర్టు కు ఏ పి పి గా పల్లపోతు అంకరాజు, 10 వ అదనపు జిల్లా కోర్టు కు  ఏ పి పి గా కమ్మగంటి చంద్రశేఖర్, అదనపు అసిస్టెంట్ సెషన్ కోర్టు  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ గా అడపా మురళీ కృష్ణ లు  ఉన్నారు.

ఈ అయిదుగురిని మంత్రి  అభినందింస్తూ,  బాధితుల తరుపున వాదించే మీరు న్యాయం వైపునే మొగ్గు చూపాలన్నారు. ప్రభుత్వం మీకు ఒక చక్కని అవకాశం ఇచ్చిందని, ఆ ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఏ కోశానా మీపై బాధితులకు అపనమ్మకం కలగరాదని తెలిపారు. 
 
మీ ప్రవర్తన, నడవడిక, క్రమశిక్షణ ఎందరికో ఆదర్శం కావాలన్నారు. వీరితో పాటు మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు  వడ్డీ జితేంద్ర మోహన్ లోహియా  పలువురు న్యాయవాదులు హజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments