Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాటుగా విద్యుదుత్ప‌త్తి, పోలీసు వ‌ల‌యంలో పులిచింత‌ల

Webdunia
సోమవారం, 12 జులై 2021 (16:17 IST)
ఆంధ్ర‌, తెలంగాణా మ‌ధ్య జ‌ల వివాదాన్ని రాజేసిన పులించిత‌ల ప్రాజెక్ట్ ఇపుడు పోలీసు వ‌ల‌యంలో ఉంది. పులిచింత‌ల ప్రాజెక్ట్ ను సంద‌ర్శించ‌బోయిన వారిని తెలంగాణా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ విప్ సామినేని ఉదయభానుని తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. 
 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని తెలంగాణ రాష్ట్రం సరిహద్దు బుగ్గమాధారం వ‌ద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంద‌ని, అందుక‌నే త‌మ‌ని అడ్డుక‌న్నార‌ని ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభాను ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చిన మమ్మల్ని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దారుణమ‌న్నారు. అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ఇదే విధంగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకోం అన్నారు. ఉద‌యభాను వెంట తన్నీరు నాగేశ్వరరావు, అంగడాల పూర్ణ భారీ  సంఖ్యలో కార్యకర్తలున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments