Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా : పోసానిపై టీడీపీ

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (13:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరపున వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు మండిపడ్డారు. జగన్‌ను ఏమైనా అంటే ఊరుకోబోనంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
 
దీనిపై పోసానిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పవన్‌పై పోసాని చేసిన వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారని ఆరోపించారు. జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి పోసాని సిగ్గుపడాలని అన్నారు. తన నవరసాలను పోసాని తాడేపల్లిలో చూపించుకోవాలని చెప్పారు.
 
ఆడవాళ్ల గురించి పోసాని అసభ్యంగా మాట్లాడారని... ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సంస్కారం గురించి మాట్లాడే అర్హత పోసానికి లేదని అన్నారు. పోసానికి కొడాలి నాని, ధర్మాన, ఎమ్మెల్యే ద్వారంపూడి సంస్కారం నేర్పించగలరా? అని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments