Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యను అడ్డుకున్న ఖాకీలు - మా జోలికొస్తే తిరగబడతామంటూ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (14:29 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో బాలయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఇక్కడ మూడు రోజుల క్రితం జాతర జరిగింది. ఆ సమయంలో వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. వైకాపా కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. అతన్ని పరామర్శించేందుకు బాలయ్య ఆ గ్రామానికి వచ్చారు. 
 
కానీ, బాలయ్యను ఆ గ్రామానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు దిగివచ్చి మొత్తం కాన్వాయ్‌ను కాకుండా, కేవలం బాలయ్య వాహనాన్ని మాత్రమే గ్రామంలోకి వెళ్లనిచ్చారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, గ్రామాలో పగలు, ప్రతీకారాలు రేపే విధంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. మరోమారు తమ కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments