తిరుపతిలో జరుగుతున్న మహానాడులో పోలీసుల ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. భద్రత పేరుతో పోలీసులు అరాచక చర్యలకు పాల్పడుతున్నారు. శుక్రవారం ఉదయం మహానాడు ప్రారంభమైనప్పటి నుంచి తెదేపా కార్యకర్తలు, నాయకులపై ఆంక్షలు విధించారు. లోపల గ్యాలరీలు ఖాళీగా ఉన్న తెదేపా శ్రేణులను లోపలికి అనుమతించలేదు. కొంతమంది కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిపై దురుసుగా ప్రవర్తించారు.
అంతేకాదు మీడియా ప్రతినిధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు మహానాడులోని గ్యాలరీతో పాటు రక్తదాన శిబిరాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులను పోలీసులు పక్కకు నెట్టేశారు. ఎందుకు పక్కకు నెడుతున్నారని ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళండి.. వెళ్ళండంటూ.. బయటకు తోసేశారు. దీంతో మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. పోలీసుల ఓవరాక్షన్పై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు జర్నలిస్టు సంఘాలు సిద్ధమవుతున్నాయి.