Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని టీడీపీ జాతీయ కార్యాలయానికి నోటీస్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (15:03 IST)
మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాల‌యంపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ త‌మ‌కు ఇవ్వాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని కోరారు. 
 
 తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి ఘటన అనంతరం కార్యాలయ ఉద్యోగి బద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌మ కార్యాల‌యంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు మూకుమ్మ‌డిగా దాడి చేసి ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కొంద‌రు కార్యాల‌య సిబ్బందిపై కూడా దాడి చేసి, వారిని క‌ర్ర‌ల‌తో కొట్టార‌ని వివ‌రించారు. కొన్ని కార్లు కూడా ధ్వంసం చేశార‌ని, సుత్తులు, క‌ర్ర‌లు, ఇత‌ర మార‌ణాయుధాల‌తో వ‌చ్చార‌ని పేర్కొన్నారు. 
 
కార్యాల‌య ఉద్యోగి బ‌ద్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కార్యాలయ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments