Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (10:37 IST)
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐను బెదిరించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 27వ తేదీన పోలీసులు ఈ కేసు నమోదు చేయగా, ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి ముఖ్య అనుచరుడు, వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మండల వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
దీనిపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే సీఐ పచ్చ చొక్క ధరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ తిరగాల్సి ఉంటుందంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులను బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా సాగకుండా నిర్వీర్యం చేయాలని చూశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం