Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (10:37 IST)
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐను బెదిరించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 27వ తేదీన పోలీసులు ఈ కేసు నమోదు చేయగా, ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి ముఖ్య అనుచరుడు, వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మండల వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
దీనిపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే సీఐ పచ్చ చొక్క ధరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ తిరగాల్సి ఉంటుందంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులను బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా సాగకుండా నిర్వీర్యం చేయాలని చూశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం