Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (15:06 IST)
వైకాపా నేత, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అరండల్ పేట పోలీసుకు టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై పరుష, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీనివాస రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
గత వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసింది. ఆ సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు అరండల్ పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అపుడు మనోహర్ నాయుడు అక్కడకు చేరుకుని వీరంగం సృష్టించారు. పోలీసుల వద్ద నుంచి లాఠీ మరీ తీసుకుని టీడీపీ - జనసేన శ్రేణులపట్ల దురుసుగా ప్రవర్తించాడు. అలాగే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను దూషించారు. 
 
దీనిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments