Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (15:06 IST)
వైకాపా నేత, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అరండల్ పేట పోలీసుకు టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై పరుష, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీనివాస రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
గత వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసింది. ఆ సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు అరండల్ పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అపుడు మనోహర్ నాయుడు అక్కడకు చేరుకుని వీరంగం సృష్టించారు. పోలీసుల వద్ద నుంచి లాఠీ మరీ తీసుకుని టీడీపీ - జనసేన శ్రేణులపట్ల దురుసుగా ప్రవర్తించాడు. అలాగే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను దూషించారు. 
 
దీనిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments