Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (15:06 IST)
వైకాపా నేత, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అరండల్ పేట పోలీసుకు టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై పరుష, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీనివాస రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
గత వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసింది. ఆ సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు అరండల్ పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అపుడు మనోహర్ నాయుడు అక్కడకు చేరుకుని వీరంగం సృష్టించారు. పోలీసుల వద్ద నుంచి లాఠీ మరీ తీసుకుని టీడీపీ - జనసేన శ్రేణులపట్ల దురుసుగా ప్రవర్తించాడు. అలాగే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను దూషించారు. 
 
దీనిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments