Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పర్యటించనున్న ప్రధాన మంత్రి.. శ్రీవారి దర్శనం

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (11:40 IST)
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు ఆయన తిరుపతికి వెళ్లి రాత్రికి తిరుమలలో బస చేస్తారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 8.45 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీఎం బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 
 
అయితే ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆయనను ప్రత్యేకంగా కలుస్తారా? రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చిస్తారా? ప్రొటోకాల్ ప్రకారం స్వాగతించడానికి మాత్రమే వెళ్లాలా అనే చర్చ కూడా సాగుతోంది. 
 
మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈమేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీ సాయంత్రం వైమానిక దళంలో తిరుపరి విమాశ్రయానికి చేరుకుని, అనంతరం తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు. 
 
27న ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నట్లు సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. అందువల్ల ప్రధాని పర్యటనకు సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments