Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికులను ఆదుకోండి ప్లీజ్: కన్నా

Webdunia
బుధవారం, 6 మే 2020 (20:35 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వలస కార్మికుల కాలినడకన వారి స్వస్థలాలకు చేరుకోవడానికి పడుతున్న అష్ట కష్టాలపై స్పందించి వారికి వెంటనే సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాశారు. 
 
కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడ నిలచి పోవడంతో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోవలన్న ఆందోళనలో వందల కిలోమీటర్లు చిన్న పిల్లలతో కలసి భుజాలపై సామాను పెట్టుకుని చేతిలో డబ్బులు లేకుండా కాలినడకతో ప్రయాణం చేస్తున్న వారి దయనీయ పరిస్థితి హృదయ విధారకంగా ఉందని,వారిలో కొంత మంది గర్భిణులు కూడా ఉండటం దురదృష్టకరమని వారి పరిస్థితిని తెలియజేశారు. 
 
వలస కార్మికులు పడుతున్న ప్రయాణ కష్టలకు అండగా ఆహార పొట్లాలు,తాగునీరు,మజ్జిగ పాకెట్లు మరియు పాలు మొదలైన కనీస అవసరాలు అందించేలా ఆదేశాలు జారీ చేయాలని అలాగే వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లతో పాటు వేసవి తాపం నుంచి ప్రాణాలు కాపాడుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments