వలస కార్మికులను ఆదుకోండి ప్లీజ్: కన్నా

Webdunia
బుధవారం, 6 మే 2020 (20:35 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వలస కార్మికుల కాలినడకన వారి స్వస్థలాలకు చేరుకోవడానికి పడుతున్న అష్ట కష్టాలపై స్పందించి వారికి వెంటనే సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాశారు. 
 
కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడ నిలచి పోవడంతో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోవలన్న ఆందోళనలో వందల కిలోమీటర్లు చిన్న పిల్లలతో కలసి భుజాలపై సామాను పెట్టుకుని చేతిలో డబ్బులు లేకుండా కాలినడకతో ప్రయాణం చేస్తున్న వారి దయనీయ పరిస్థితి హృదయ విధారకంగా ఉందని,వారిలో కొంత మంది గర్భిణులు కూడా ఉండటం దురదృష్టకరమని వారి పరిస్థితిని తెలియజేశారు. 
 
వలస కార్మికులు పడుతున్న ప్రయాణ కష్టలకు అండగా ఆహార పొట్లాలు,తాగునీరు,మజ్జిగ పాకెట్లు మరియు పాలు మొదలైన కనీస అవసరాలు అందించేలా ఆదేశాలు జారీ చేయాలని అలాగే వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లతో పాటు వేసవి తాపం నుంచి ప్రాణాలు కాపాడుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments