Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.45 కోట్లతో తాడికొండ గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం ప్రణాళిక

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (06:50 IST)
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (గుంటూరు) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గుంటూరు జిల్లాలోని ‘రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ తాడికొండ’ సమగ్ర అభివృద్ధి కోసం ఈ పాఠశాల పూర్వ విద్యార్థులతో సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగింది.

సమావేశంలో  పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్య సాంకేతిక సలహాదారు ఎ.మురళి, ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిణి కె.వెట్రిసెల్వి, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా.ఎం.ఆర్. ప్రసన్నకుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

1972లో స్థాపించిన తాడికొండ గురుకుల పాఠశాల సమగ్ర అభివృద్ధి కి దాదాపు రూ.45 కోట్లతో మౌలిక సదుపాయాలు విద్యార్థుల సమగ్ర వికాసానికి, నాణ్యమైన విద్య పొందడానికి తగిన ఏర్పాట్లు కోసం కార్యచరణప్రణాళకను ఈ  సమావేశంలో రూపొందించారు.

పూర్వవిద్యార్థుల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాఠశాలకు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి తీర్మానించడమైనది. 

2022 సంవత్సరం నాటికి ఈ పాఠశాల 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లును ఇప్పటినుండే ప్రారంభించవలసిందిగా పాఠశాల ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments