Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిన్నెల్లికి జూన్ 6వ తేదీతో ముగియనున్న గడువు!! ఇంటి వద్ద పోలీసుల పహారా (Video)

వరుణ్
గురువారం, 6 జూన్ 2024 (09:37 IST)
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత  పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు కల్పించిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారం రాత్రితో ముగియనుంది. మే నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలోకి పిన్నెల్లి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వషయం తెల్సిందే. అలాగే, మాచర్లలో జరిగిన పలు దాడుల కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. 
 
అయితే, ఈ నెల ఆరో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇపుడు ఈ గడువు తీరిపోనుంది. మరోవైపు, బందోబస్తుతో వైకాపా నేతను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకొచ్చిన పోలీసులు రిజిస్టర్‌లో సంతకం చేయించారు. నరసరావుపేట పట్టణ శివారు రావిపాడు రెవెన్యూ పరిధిలో ఆయన బస చేసిన ప్రైవేటు విల్లా (గృహం) వద్ద భద్రత మరింతగా పెంచారు. తప్పించుకుని వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పహారా కాస్తున్న పోలీసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments