Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులతో గోవిందనామస్మరణలతో మారుమ్రోగిన అలిపిరి

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (17:59 IST)
తిరుమల శ్రీవారి దర్సనార్థం సామాన్య భక్తులను ఈరోజు నుంచి అనుమతించింది టిటిడి. టోకెన్లు పొందిన భక్తులను అలిపిరి పాదాల నుంచి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు అనుమతించారు. 80 రోజులుగా బోసిపోయిన కనిపించిన అలిపిరి సామాన్య భక్తులతో కళకళలాడింది.
 
గోవింద నామస్మరణలతో భక్తులు తిరుమలకు పయనమై వెళ్ళారు. నిన్న ఆఫ్‌లైన్లో 3వేల టోకెన్లను అందించింది టిటిడి. అయితే భక్తులు అధికసంఖ్యలో క్యూలైన్లలో నిలబడి ఉండటంతో 14వ తేదీ వరకు టోకెన్లను అందించారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అలిపిరి పాదాల మండపం తిరుమలకు అనుమతించారు.
 
అలాగే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా టోకెన్లను చూసిన తరువాత భక్తులను సొంత వాహనాల్లోను, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు అనుమతించారు. భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల, తిరుపతి ప్రస్తుతం భక్తులతో కళకళలాడుతోంది. చాలారోజుల తర్వాత భక్తులను చూసిన స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై కూడా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద వాహనాలకు శానిటైజేషన్ చేయడం.. భక్తులు చేతులను శుభ్రం చేసుకున్న తరువాతనే పంపిస్తున్నారు. అలాగే ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments