Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు... లీటరు ధరపై ఎంతంటే?

ఠాగూర్
శుక్రవారం, 15 మార్చి 2024 (12:36 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రం ఈ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. ఫలితంగా లీటరు పెట్రోల్‍‌, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గించింది. ఈ సవరించిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల తగ్గుదలపై కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటన చేసింది. 
 
చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజల్ ధరలను దేశవ్యాప్తంగా సవరిస్తున్నట్టు సమాచారం ఇచ్చామని పెట్రోలియం శాఖ వెల్లడించింది. ఈ తగ్గింపు నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తుందని, డీజిల్‌తో నడిచే 58 లక్షల గూడ్సు వాహనాలు, ఆరు కోట్ల కార్లు, 277 కోట్ల ద్విచక్రవాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. లీటరు పెట్రోల్‌పై రూ.2 తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజల్ ధరలు శుక్రవారం నుంచి ఇలా ఉన్నాయి. 
 
దేశ వ్యాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ పాత ధర రూ.106.31 కాగా, కొత్త ధర ప్రకారం రూ.104.21కు చేరుకుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పాత ధర రూ.96.72గా ఉంటే కొత్త ధర ప్రకారం రూ.94.72కు చేరుకుంది. అలాగే, కోల్‌కతాలో పాత ధర రూ.106.03గా ఉండగా, కొత్త ధర రూ.103.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ పాత ధర రూ.102.63కాగా, కొత్త ధర రూ.100.75గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments