Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్-5 జోన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (14:43 IST)
అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వ్యవహారంపై అమరావతి ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి చంద్రసూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ నెల 14వ తేదీన విచారణకు రానుంది. ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు దాఖలు చేశారు. 
 
వాస్తవానికి ఈ నెల 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరపున న్యాయవాది కోరగా.. ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. అందుకే ఈ పిటిషన్‌ను 14వ తేదీన విచారణకు తీసుకుంటామని చెప్పారు. అమరావతి రైతులు ఆర్‌-5 జోన్‌పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
అయితే ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)లో మార్పులు చేస్తూ ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments