Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్-5 జోన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (14:43 IST)
అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వ్యవహారంపై అమరావతి ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి చంద్రసూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ నెల 14వ తేదీన విచారణకు రానుంది. ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు దాఖలు చేశారు. 
 
వాస్తవానికి ఈ నెల 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరపున న్యాయవాది కోరగా.. ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. అందుకే ఈ పిటిషన్‌ను 14వ తేదీన విచారణకు తీసుకుంటామని చెప్పారు. అమరావతి రైతులు ఆర్‌-5 జోన్‌పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
అయితే ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)లో మార్పులు చేస్తూ ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments